హీరోగా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత చిలాసౌ సినిమాతో దర్శకుడుగా మారిన నటుడు రాహుల్ రవీంద్రన్ మొదటి సినిమాతోనే దర్శకుడుగా మంచి మార్కులు వేసుకోవడంతో పాటు ఏకంగా నేషనల్ అవార్డు కూడా అందుకున్న రాహుల్ రెండో సినిమాని కింగ్ నాగార్జునతో చేసే అవకాశం సొంతం చేసుకున్నాడు.అయితే నాగార్జున ఇచ్చిన మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని క్రేజీ దర్శకుడుగా రాహుల్ మారుతాడు అనుకుంటూ ఒక డిజాస్టర్ తో క్రింద పడిపోయాడు.
మన్మధుడు లాంటి క్లాసిక్ టైటిల్ తీసుకొని ఒక ఏజ్ బార్ హీరో రొమాంటిక్ జర్నీ, లవ్ స్టొరీని తెరపై ఆవిష్కరించాడు.అయితే ఈ కథతో ప్రేక్షకులని మెప్పించలేకపోయాడు.
దీంతో చాలా గ్యాప్ తీసుకున్న రాహుల్ రవీంద్రన్ లాక్ డౌన్ టైమ్ లో చాలా కథలు రాసుకున్నట్లు తెలుస్తుంది.
ఈ నేపధ్యంలోనే రీసెంట్ గా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో నిర్మాత బన్నీ వాస్ కి ఓ లవ్ స్టొరీ చెప్పి మెప్పించాడు.
దీంతో రాహుల్ దర్శకత్వంలో ఆ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి బన్నీ వాస్ రెడీ అయ్యాడు.ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది.అయితే ఈ మూవీలో హీరోగా మెగా కాంపౌండ్ హీరోలనే తీసుకుంటారా లేక బయటి హీరోకి వెళ్తారా అనేది మాత్రం ప్రస్తుతానికి క్లారిటీ లేదు.
ఇదిలా ఉంటే రాహుల్ హీరోగా ది గ్రేట్ ఇండియన్ కిచెన్ తమిళ్ రీమేక్ లో ఐశ్వర్య రాజేష్ కి జోడీగా నటిస్తున్నాడు.ఇదిలా ఉంటే అన్నపూర్ణ బ్యానర్ లో కూడా మరో సినిమా చేసే అవకాశం కింగ్ నాగార్జున రాహుల్ రవీంద్రన్ కి ఇచ్చినట్లు టాక్ వస్తుంది.సమంతతో కూడా ఒక ఫిమేల్ సెంట్రిక్ స్టొరీని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.