హిట్, ఫ్లాపులకు అతీతంగా తెలుగు, తమిళ భాషల్లో శృతిహాసన్ అవకాశాలను అందిపుచ్చుకుంటున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న సలార్ సినిమాలో శృతిహాసన్ నటిస్తున్నారు.
ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్న శృతిహాసన్ మరోవైపు సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటూ డిజిటల్ ఇంటర్వ్యూస్ ఇస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను సైతం శృతిహాసన్ అభిమానులతో పంచుకుంటూ ఉండటం గమనార్హం.
తాజాగా శృతిహాసన్ మాట్లాడుతూ అభిమానులు కొన్ని విషయాలలో తనను అపార్థం చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు.తాను రియల్ లైఫ్ లో బోల్డ్ గా ఉంటానని ఆమె వెల్లడించారు.ఏ విషయం గురించైనా తాను స్ట్రెయిట్ గా మాట్లాడతానని ఆమె పేర్కొన్నారు.
అయితే తనకు ఉన్న ఈ స్వభావం వల్ల కొంతమంది తనను అపార్థం చేసుకుంటున్నారని శృతి వెల్లడించారు.
అయితే ఇతరులు అపార్థం చేసుకున్నా ఈ నేచర్ ను మార్చుకోవాలనే ఆలోచన అయితే తనకు లేదని ఆమె తెలిపారు.దాదాపు రెండున్నరేళ్లు గ్యాప్ తీసుకుని సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ కు సినిమా ఆఫర్లు అయితే ఎక్కువగానే వస్తుండటం గమనార్హం.
బాలకృష్ణ గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ లో సైతం హీరోయిన్ గా శృతిహాసన్ పేరు వినిపిస్తోంది.అయితే శృతిహాసన్ ఈ సినిమాలో నటిస్తున్నారో లేదో తెలియాల్సి ఉంది.కమల్ హాసన్ కూతురు అయినప్పటికీ తండ్రి పేరును ఉపయోగించకుండా కెరీర్ లో స్వంతంగా ఎదిగేందుకు శృతిహాసన్ ప్రయత్నిస్తున్నారు.కొన్నిరోజుల క్రితం శృతిహాసన్ తనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని వెల్లడించిన సంగతి తెలిసిందే.
కెరీర్ తొలినాళ్లలో యంగ్ హీరోలతో ఎక్కువగా నటించిన శృతిహాసన్ ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోల సినిమాలకు ఎక్కువగా గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం గమనార్హం.