2022 సంవత్సరంలో విడుదల కాబోతున్న సినిమాలలో తారక్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఒకటనే సంగతి తెలిసిందే.షూటింగ్ ప్రారంభం కాకముందే భారీగా అంచనాలు నెలకొన్న ఈ సినిమాకు సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఈ సినిమాలో నలుగురు సీనియర్ హీరోలు నటిస్తున్నారని ఒక వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ తన గత సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన ముగ్గురు సీనియర్ హీరోలను, ఒక బాలీవుడ్ స్టార్ హీరోను త్రివిక్రమ్ ఈ సినిమా కోసం తీసుకుంటున్నారని సమాచారం.
ఈ సినిమాలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్, కన్నడలో విలక్షణ పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఉపేంద్ర, అల వైకుంఠపురములో హీరో తండ్రి పాత్రలో నటించి మెప్పించిన జయరామ్ నటించబోతున్నారని తెలుస్తోంది.
సినిమాలో ఎన్టీఆర్ కు తండ్రిగా రాజేంద్ర ప్రసాద్ నటించనుండగా విలన్ గా సంజయ్ దత్ నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.అయితే అధికారిక ప్రకటన వస్తే మాత్రమే వైరల్ అవుతున్న ఈ వార్తకు సంబంధించి నిజానిజాలు తెలిసే అవకాశం ఉంటుంది.ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనుందని.
ఎన్టీఆర్ విదేశాల నుంచి ఇండియాకు వస్తాడని తెలుస్తోంది.మే నెల చివరి వారం నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ కు సంబంధించి అనేక గాసిప్స్ ప్రచారంలోకి వస్తున్నాయి.కియారా అద్వానీని ఈ సినిమలో హీరోయిన్ రోల్ కోసం సంప్రదించగా ఆమె ఈ సినిమాలో నటించడానికి నో చెప్పిందని పూజా హెగ్డే, రష్మికలలో ఎవరో ఒకరు ఈ సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.