ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావడంతో కొందరు వాటి ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారు. అయితే తాజాగా ఓ వ్యక్తి ఏకంగా బాలీవుడ్ కి చెందినటువంటి స్టార్ హీరోయిన్ ని నడి రోడ్డుపై దారుణంగా అత్యాచారం చేస్తామంటూ సోషల్ మీడియా మాధ్యమం అయిన ఫేస్ బుక్ ద్వారా బెదిరింపులకు పాల్పడిన ఘటన ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది.
వివరాల్లోకి వెళితే మొదట్లో ఎలాంటి సినీ కుటుంబం బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమకు వచ్చి అష్టకష్టాలు పడి స్టార్ హీరోయిన్ గా ఎదిగినటువంటి బాలీవుడ్ క్వీన్ “కంగనా రనౌత్” ప్రస్తుతం నెపోటిజంపై పోరాటం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో తాజాగా ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఓ లాయర్ తన అధికారిక ఫేస్ బుక్ ఖాతా ద్వారా కంగనా రనౌత్ ని నడిరోడ్డు పై అత్యాచారం చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.
దీంతో తాజాగా ఈ విషయంపై స్పందించిన ఆ లాయర్ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తన ఫేస్ బుక్ అకౌంట్ ని హ్యాక్ చేశారని చెప్పుకొచ్చాడు.అంతేగాక వెంటనే తాను తన ఫేస్ బుక్ ఖాతాను తొలగిస్తున్నట్లు కూడా తెలిపాడు.
తన ప్రమేయం లేకుండా జరిగినటువంటి ఈ తప్పిదానికి క్షమించాలని అంటూ క్షమాపణలు కూడా కోరాడు.అలాగే తన ఫేస్ బుక్ ఖాతాను హ్యాక్ చేసినటువంటి వ్యక్తులను గుర్తించి శిక్షించాలంటూ పోలీసులను కోరాడు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కంగనా రనౌత్ తమిళంలో “తలైవి” అనే చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తోంది.అలాగే బాలీవుడ్ లో ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రంలో కూడా నటిస్తున్నట్లు సమాచారం.