క్రికెట్ క్రీడలో ఫార్మెట్ ఏదైనా సరే తన అసమాన తీరైన ప్రతిభతో పరుగుల వరద పారించే భారత క్రికెట్ జట్టు కెప్టెన్ “విరాట్ కోహ్లీ” గురించి క్రీడా అభిమానులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.2008వ సంవత్సరంలో ఆగస్టు 18వ తారీఖున శ్రీలంకతో జరిగినటువంటి వన్డే మ్యాచ్ ద్వారా బ్యాట్స్ మెన్ గా జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చినటువంటి విరాట్ కోహ్లీ తన ఆట తీరుతో ఎంతగానో అలరిస్తూ కెప్టెన్ గా ఎదిగాడు.అంతేగాక ఇప్పటికీ భారతదేశ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ నెలకొల్పిన రికార్డులను ప్రస్తుతం ఉన్నటువంటి ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ లు మాత్రమే కొల్లగొట్టే అవకాశాలు ఉన్నాయని గతంలో పలుమార్లు సచిన్ టెండూల్కర్ ప్రశంసించాడు.
అయితే తాజాగా విరాట్ కోహ్లీ సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతుంది.
అయితే ఇంతకీ ఆ ఫోటో ఏమిటంటే ఇటీవలే కొందరు విరాట్ కోహ్లీ అభిమానులు తన ఫోటోని తీసుకొని ఫేస్ యాప్ ని ఉపయోగించి 60 ఏళ్ల తర్వాత విరాట్ కోహ్లీ ఎలా ఉంటాడో క్రియేట్ చేసి సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేశారు.కాగా ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం విరాట్ కోహ్లీ బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఐపీఎల్ 13వ సీజన్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు తరఫున పాల్గొంటున్నాడు.అయితే ఈ సీజన్ ప్రారంభంలో కొంతమేర నిలకడలేని కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇబ్బంది పడినప్పటికీ గత 5 మ్యాచ్లతో పోలిస్తే బాగానే రాణిస్తున్నాడు.
దీంతో ఈసారి ఎలాగైనా ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకోవాలని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తీవ్రంగా శ్రమిస్తోంది.