నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం షూటింగ్ ఇప్పటికే దాదాపుగా సగం అయ్యింది.ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త ఇటీవల సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది.
సినిమాలో కీలక పాత్రలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించబోతున్నాడు అనేది ఆ వార్త సారాంశం.బోయపాటి శ్రీనుకు బెల్లంకొండ హీరోకు మంచి సంబంధం ఉంది.
జయ జానకి నాయక చిత్రంతో శ్రీనివాస్కు మంచి సక్సెస్ను అందించిన విషయం తెల్సిందే.
బోయపాటిపై ఉన్న గౌరవం మరియు నమ్మకంతో బాలకృష్ణ మూవీలో నటించేందుకు శ్రీనివాస్ ఓకే చెప్పాడు అంటూ వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అసలు ఇప్పటి వరకు అలాంటి చర్చలు జరగలేదట.ఈ విషయాన్ని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన మీడియా మిత్రుల వద్ద అన్నాడట.
బాలయ్య మూవీలో నటించబోతున్నావా అంటూ ఆయన్ను ప్రశ్నించిన సమయంలో ఇప్పటి వరకు ఆ విషయమై బోయపాటి గారు కాని మరెవ్వరు కాని నన్ను సంప్రదించలేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు.
ప్రస్తుతం ఈయన అల్లుడు అదుర్స్ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే.
ఈ చిత్రం తర్వాత చేయబోతున్న విషయమై ఈ లాక్డౌన్లో చర్చలు జరుపుతున్నాడట.త్వరలోనే షూటింగ్కు వెళ్లే అవకాశం ఉందంటున్నారు.
అల్లుడు అదుర్స్ చిత్రాన్ని సంక్రాంతి లేదా రిపబ్లిక్ డేకు విడుదల చేసేందుకు బెల్లంకొండ బాబు తాపత్రయ పడుతున్నాడు.