కరోనా లాక్డౌన్తో మూడు నెలలుగా షూటింగ్స్ లేకపోవడంతో దర్శకుడు పూరి జగన్నాధ్ పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యి జనగనమణ చిత్రం స్క్రిప్ట్ను పూర్తి చేశాడట.మూడు నాలుగు సంవత్సరాల క్రితం మహేష్బాబు కోసం ఈ స్క్రిప్ట్ను అనుకున్నాడు.
అప్పుడు స్టోరీ లైన్ మాత్రమే విన్న మహేష్బాబు తర్వాత చేద్దామన్నాడు.ఆ సమయంలోనే పూరికి వరుసగా ఫ్లాప్స్ పడ్డాయి.
దాంతో మహేష్ మొహం చాటేస్తూ వచ్చాడు.ఇప్పుడు పూరికి ఇస్మార్ట్ శంకర్తో సక్సెస్ వచ్చింది.
ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఒక సినిమాను చేస్తున్నాడు.ఈ సినిమాతో పాటు మరో సినిమాను చేసి రెండు సినిమాలను సక్సెస్ చేసుకోగలిగితే అప్పుడు మహేష్బాబు స్క్రిప్ట్ వినేందుకు ఆసక్తి చూపించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
ప్రస్తుతం మహేష్బాబుతో పరశురామ్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.ఆ తర్వాత రాజమౌళితో సినిమా చేయాల్సి ఉంది.కాని అంతకు ముందు మహేష్బాబు ఒక సినిమా చేస్తాడని టాక్ వినిపస్తుంది.
మహేష్బాబుతో సినిమా చేయాలంటే దర్శకుడు పూరి స్క్రిప్ట్ను పక్కాగా రెడీ చేయడంతో పాటు అంతకు ముందు కనీసం ఒక్కటి లేద రెండు సినిమాలతో సక్సెస్ దక్కించుకోవాల్సి ఉంటుంది.అలా అయితేనే మహేష్ బాబు సినిమా చేస్తాడని చాలా కాలంగా టాక్ ఉంది.గతంలో పూరి కూడా ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు.