దేశంలో మరో 19 రోజుల పాటు లాక్డౌన్ను కొనసాగించాల్సిందే అని, ప్రస్తుత పరిస్థితుల్లో మరో దారి లేదు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేసిన నేపథ్యంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.లాక్డౌన్ కొనసాగింపు నిర్ణయంను తప్పుబట్టాడు.
ఇదే సమయంలో దేశంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రధాని ఆ విషయాన్ని కనీసం పట్టించుకోకుండా లాక్డౌన్ను పొడగించాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ…
ఈ సమయంలో మీకు ఒక సినిమా డైలాగ్ చెప్తాను.
అనార్కలీ ఇలా జరగకపోతే సలీం నిన్ను చంపేస్తాడు, అలాగని మేము నిన్ను బతకనివ్వం’ అన్నట్లుగా ప్రధాని వ్యవహరించాడంటూ ఓవైసీ అసహనం వ్యక్తం చేశాడు.లాక్ డౌన్ పొడగించకుంటే పేదలు చనిపోయే పరిస్థితి ఉంది.
అలాగని లాక్ డౌన్ కొనసాగించినా ఆకలి చావులు తప్పదు అన్నట్లుగా పేదలు ఉన్నట్లుగా ఓవైసీ అసహనం వ్యక్తం చేశాడు.