రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోయిన ఎంపీ

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత యువత నుంచి పెద్దవాళ్ళ వరకు చుట్టూ ఏం జరుగుతుంది తెలుసుకోవడానికి సోషల్ మీడియా యాప్స్, వెబ్ సైట్ లు, పేస్ బుక్ ల మీద ఆధారపడటం అలవాటు పడ్డారు.ఇక ప్రపంచంలో ఎ మూల ఏం జరిగిన క్షణాలలో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయిపోతుంది.

 Ladakh Mp Gets Pms Praise For Lok Sabha Speech On Article 370-TeluguStop.com

ఈ నేపధ్యంలో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అతి తక్కువ టైంలోనే రాత్రికి రాత్రి సెలబ్రిటీలుగా మారిపోతున్నారు.ప్రియా ప్రకాష్ వారియర్ అనే మలయాళీ భామ కేవలం కన్ను కొట్టిన వీడియోతో పాపులర్ అయిపొయింది.

ఇదిలా ఉంటే తాజాగా లోక్ సభలో ఓ ఎంపీ ఇప్పుడు రాత్రికి రాత్రి సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయాడు.జామ్‌యాంగ్ సెరింగ్ నామ్‌గ్యాల్ అనే లద్దాక్ ఎంపీ గురించి నిన్నటి వరకు ఎవరికీ తెలియదు.

అయితే కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ఆర్టికల్ 370 రద్దుపై బిల్‌లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో జామ్‌యాంగ్ చేసిన ప్రసంగం అందరి ఆకర్షించింది.ప్రధాని మోదీ, షాలను కూడా అతని ప్రసంగం ఆకట్టుకుంటుంది.

దీంతో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆయన్ని ప్రశంసిస్తూ, తన ప్రసంగానికి సంబంధించి వీడియోని ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.ప్రధాని ట్వీట్ తో జామ్‌యాంగ్ రాత్రికి రాత్రి స్టార్‌గా మారిపోయారు.

దీంతో అతనిని పేస్ బుక్ లో ఫాలో అయ్యేవారి సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది.పేస్ బుక్ లో తన ఫ్రెండ్ లిస్టు ఫుల్ అయిపోయిందని, తనని అభిమానించే వాళ్ళు తన ఎకౌంటు లైక్ చేసి తనని ఫాలో అవ్వొచ్చని అతను కామెంట్ చేసాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube