రాష్ట్రంలో 2.60 లక్షల టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.మొదటగా నెల్లూరు లో 5 వేల ఇళ్లను లబ్దిదారులకు అందించాం ఆ ప్రాంతాల్లో పాఠశాలతో పాటు మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తున్నాం.దేశంలో అభివృద్ధి చేపట్టనున్న 9 నగరాల్లో ఏపీలో మూడు రాష్ట్రాలను కేంద్రం గుర్తించింది.
తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి.
స్వచ్ఛ భారత్ లో భాగమైన స్వచ్ఛ ఆంధ్ర గా తీర్చి దిద్ధేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నాం రాజీవ్ గృహకల్ప ఉద్దేశమే మధ్య తరగతి కుటుంబాల కోసం.
అందులో ఎలాంటి తప్పిదాలు లేవు.పేదల అవసరాలను తీర్చడమే మా ప్రభుత్వ లక్ష్యం.గత ప్రభుత్వం 300 sft ఇళ్లను 2.30 లక్షలు నిర్ణయించింది.సీఎం జగన్ ఆ ఇళ్లను ఒక్క రూపాయికే ఇస్తున్నారు.