వంటలక్క అంటే మన టెలివిజన్ సీరియల్ వంటలక్క అని అనుకోకండి మిత్రులారా! విషయం తెలియాలంటే ఇది పూర్తిగా చదవండి మరి.పాకిస్థాన్ కుకింగ్ షోలో ఓ మహిళ చేసిన పనికి అక్కడున్న జడ్జీలకు మైండ్ దొబ్బింది.
అవును, ఓ రకంగా చెప్పుకోవాలంటే వారి సహనానికి పరీక్ష పెట్టింది ఆవిడ.ఇక మన డ్యాన్స్ షోల్లో కొన్నిసార్లు ఎలాగైతే జడ్జీలు లేచి వెళ్లిపోతారో.
అక్కడ కూడా షేమ్ టు షేమ్ అలానే జరిగింది.ఆమె చేసిన పనికి.
తర్వాత ఆమె వాదనకు జడ్జీలకు ఏం మాట్లాడాలో కూడా అర్థంకాని పరిస్థితి నెలకొనగా ఆ విషయం ఇపుడు ఏకంగా సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతోంది.
ఇంతకీ ఆ మహిళ ఏం చేసిందంటే… ఈ కుకింగ్ షోలో పార్టిసిపేట్ చేసేవాళ్లు టెస్టీ ఫుడ్ తయారు చేసి జడ్జెస్ను ఇంప్రెస్ చేయవలసి ఉంటుంది.ఇక్కడ కేవలం వండడం మాత్రమే కాకుండా వండిన దానిని అందంగా ప్లేట్లలో సర్ది, ఆర్ట్ఫుల్గా చూపించాలి.అందులో భాగంగా ఓ మహిళ బిర్యానీ బాక్స్ తీసుకువచ్చి జడ్జెస్ ముందు పెట్టింది.
బిర్యానీని ఎందుకు ఇలా బాక్స్ లో తీసుకొచ్చావని.ప్రెజెంట్ ఎందుకు చేయ్యలేదని ఆమెను ప్రశ్నించగా.
ఆ మహిళ ఓ సమాధానం చెప్పింది.కట్ చేస్తే… అక్కడ కూర్చున్న ముగ్గురు జడ్జీలకు మైండ్ పోయింది.
విషయం ఏమంటే ఆ మహిళ ఆ బిర్యానీని రెస్టారెంట్లో కొని తెచ్చిందంట.ఆ విషయం ఆమె నిర్భయంగా చెప్పడంతో జడ్జెస్ షాక్కు గురయ్యారు.దాంతో రెస్టారెంట్ ఫుడ్ను తేవడం ఏమిటి? నువ్వు వండిన ఫుడ్ ఎందుకు తీసుకురాలేదు? అని ప్రశ్నించారు.వెంటనే ఆ బిర్యానీ బాక్స్ తీసుకుని వెళ్ళిపోమని ఆమెకు చెప్పగా… అప్పుడా మహిళా మాట్లాడిన లాజిక్కు జడ్జీకి కోపం వచ్చి అక్కడ నుంచి వెళ్లిపోవడం కొసమెరుపు.
తమ ప్రాంతంలో ఇదే బెస్ట్ బిర్యానీ అని, ఇంతకంటే వండడం ఎవరికీ సాధ్యం కాదని ఆ మహిళ సమాధానం ఇవ్వడంతో సదరు మహిళ చెప్పిన మాట విన్న జడ్జీలు కంగుతిన్నారు.