పెండ్లికి సంబంధించిన చాలా చిత్ర విచిత్రాలు మనకు ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి.ఇక ఇలాంటి వాటికి కూడా నెట్టింట ఆదరణ చాలా ఎక్కువగానే ఉంటుంది.
అయితే సాధారణంగా ఏ భార్య కూడా తన భర్త మరో అమ్మాయిని పెండ్లి చేసుకోవడాన్ని ఒప్పుకోదు.అంతెందుకు కనీసం తన భర్త వేరే అమ్మాయిని పొగిడినా అస్సలు తట్టుకోలేదు.
ఇక ఇలాంటి క్రమంలో ఓ భార్య చేసిన పని వైరల్ అవుతోంది.అయితే ఇందులో చాలా రకాల ట్విస్టులు ఉండటంతో అది మరింత పాపులారిటీ తెచ్చుకుంటోంది.
అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథలో ఓ మహిళ తన భర్తతో 25 ఏళ్ల క్రితం పెండ్లి చేసుకుంది.
కాగా వీరికి వివాహం జరిగి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా పిల్లలు లేకపోవడంతో ఇద్దరు కూడా చాలా బాధపడేవారు.ఇక తన వంశాన్ని కాపాడుకునే క్రమంలో ఆ మహిళ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.
అదేంటంటే ఆ మహిళ తన చెల్లెలినే తన భర్తకు ఇచ్చి వివాహం చేసింది.ఇక ఆ చెల్లెలు కూడా ఒప్పుకోవడంతో ముగ్గురూ కలిసి ఎంతో సంతోషంగానే బ్రతుకుతున్నారు.
అయితే గత గురువారం నుంచి ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు అదృశ్యమైపోయారు.
![Telugu Banjgir, Chhattisgarh, Marege, Fights, Sister, Sistersmarried-Latest News Telugu Banjgir, Chhattisgarh, Marege, Fights, Sister, Sistersmarried-Latest News]( https://telugustop.com/wp-content/uploads/2021/08/viral-news-viral-sister-sister-to-her-husband-marege-died-Property-fights-Chhattisgarh.jpg)
దీంతో రాధేశ్యామ్ మరుసటి రోజు రోజువారీ పనుల్లో భాగంగా తన పొలం వద్దకు పనులు చేసేందుకు వెళ్లగా అక్కడ అక్కాచెల్లెళ్లు ఇద్దరూ కూడా చనిపోయి కననిపించారు.దీంతో ఆయన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు విచారణ జరుపుతున్నారు.అయితే ఈ దారుణమైన ఘటన ఛత్తీస్ గఢ్ లోని జంజ్ గిర్ ఏరియాలో జరిగినట్టు తెలుస్తోంది.
అయితే ఈ ఇద్దరు చెల్లెల్లకు అలాగే వారి అన్నలకు మధ్య ఆస్థి తగాదాలు ఉన్నట్టు సమాచారం.ఈ క్రమంలోనే ఈ ఇద్దరూ కూడా కోర్టు కి వెళ్లాలని నిర్ణయించుకున్న సమయంలో ఈ విధంగా చనిపోవడం సంచలనం రేపుతోంది.