ప్రస్తుతం దేశంలో ఏ స్థాయిలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఉన్నాయో అందరికీ తెలిసిందే.కాగా పెరిగిన ఈ ధరలతో సామాన్యలు నానా అవస్థలు పడుతున్నారు.
బైక్ తీయాలంటేనే భయపడిపోతున్నారు.ఇక ఇలాంటి క్రమంలో ప్రతిపక్షాలు, ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా దీనిపై ఇప్పుడు చాలా చోట్ల చాలా డిఫరెంట్ గా నిరసనలు వస్తున్నాయి.కాగా ఈ పెట్రోల్ అలాగే డీజిల్ ధరల పెంపులో భాగంగా అటు నిత్యావసరాల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోవడం పెద్ద సమస్యలు దారి తీస్తోంది.
ఇలాంటి కష్ట సమయంలో అసలు బైక్ను ఇంటి నుంచి బయటకు తీయాలంటేనే జనం భయపడిపోతున్నారు.ఇక సామాన్యలకు ఎవరికైనా బైక్ ఉన్న వారయితే మాత్రం దారుణమైన ఇబ్బందులు పడుతున్నారు.
చాలామంది ఆఫీసుకి వెళ్లాలన్నా లేదంటే ఎక్కడైనా పని మీద వెల్లాలన్నా కూడా పెట్రోల్ రేట్లు పెరిగిన నేపథ్యంలో బైక్లను పక్కన పెట్టి మరీ బస్సులోనే ప్రయాణం చేయడం ఇప్పుడు చాలా చోట్లు చూస్తూనే ఉన్నాం.అయితే ఈ సందర్భంలో ఒక వ్యక్తి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది.
![Telugu Andrapradesh, Bike, Janrdhan, Ongole, Petrol, Tdp Candiadte-Latest News - Telugu Andrapradesh, Bike, Janrdhan, Ongole, Petrol, Tdp Candiadte-Latest News -]( https://telugustop.com/wp-content/uploads/2021/08/final-ride-bike-andrapradesh-ongole-tdp-candiadte-janrdhan.jpg)
ఇప్పడు దేశ వ్యాప్తంగా పోరిగిపోయిన పెట్రోల్ అలాగే డీజిల్ రేట్లను వ్యతిరేకిస్తూ తనకున్న ఒకే ఒక్క బైక్ చనిపోయింది అని అందుకు కారణం కూడా ఈ రేట్ల పెరుగుదల అంటూ ఏకంగా తన బైక్ కి పాడే కట్టి అంతిమ యాత్ర నిర్వహించాడు.ఇక తన బైక్ ను శ్మశానికి మోసుకుపోయాడు ఈ వ్యక్తి.అయితే ఈ బైక్ను కాస్తా పాడే పై మోసుకెళ్లడం ఇప్పుడు పెద్ద సంచలనం రేపుతోంది.ఈ అంతిమ యాత్రకు కూడా ఈ కరోనా టైమ్లో బాగానే వస్తున్నారు.
అయితే ఈ నిరసన ఒంగోలులో దామచర్ల ఏరియలో జనార్దన్ అనే టీడీపీ కార్యకర్త చేసిన పని ఇది.