మన సౌత్ సినిమాలు అంటే బాలీవుడ్ ప్రేక్షకులు కానీ హీరోలు కానీ ఇంతకు ముందు తక్కువ చేసి చూసే వారు.కానీ ఇప్పుడు అలా కాదు.
మన రేంజ్ మారిపోయింది.ఇంతకు ముందులా మన సినిమాలను చిన్న సినిమాలుగా కూడా చూడడం లేదు.
బాహుబలి తో మొదలైన మన సినీ ప్రయాణం అంచలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు బాలీవుడ్ నే శాసించే స్థాయికి వచ్చింది.
ఆర్ ఆర్ ఆర్ తో జక్కన్న చేసిన మ్యాజిక్ తగ్గకుండానే వరుసగా మన సౌత్ సినిమాలు బాలీవుడ్ లో రిలీజ్ అవుతూ అక్కడి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి.
ఇప్పుడు ఉత్తరాది ప్రేక్షకులంతా సౌత్ సినిమాల మాయలో పడిపోయారు.పుష్ప నుండి మొదలైన సౌత్ మ్యానియా ఇప్పటికి తగ్గడం లేదు సరికదా రోజురోజుకూ పెరుగుతుంది.పుష్ప తర్వాత రెండో రోజు అలియా గంగూబాయి రిలీజ్ అయ్యింది.అయితే ఈ సినిమా పర్వాలేదు అనిపించింది.
ఇక ఆ తర్వాత బాలీవుడ్ సినిమాలు ఏవీ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.రిలీజ్ అయినా అన్ని సినిమాలు ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.
ఆ తర్వాత మొదలైంది అసలైన కథ.ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం మన స్టార్స్ అక్కడ వరుస ప్రొమోషన్స్ చేయడం ఆ తర్వాత సినిమా రిలీజ్ చేయడం రిలీజ్ అయ్యాక ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, భారీ కలెక్షన్స్ కూడా తెచ్చిపెట్టడం ఇలా అన్ని కూడా వరుసగా జరిగిపోతూ వస్తున్నాయి.
ఆర్ ఆర్ ఆర్ క్రేజ్ ఇపప్టి వరకు తగ్గక పోవడంతో బాలీవుడ్ సినిమాలు రిలీజ్ చేయడానికి కూడా వెనకడుగు వేశారు.దీంతో ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇన్ని వారలు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది.ఇక ఇప్పుడు మన సౌత్ కెజిఎఫ్ ను బరిలోకి దింపింది.ఈ సినిమా బాలీవుడ్ ను పూర్తి స్థాయిలో ఆక్రమించు కుంది.ఈ సినిమా అక్కడ కూడా పాజిటివ్ టాక్ వస్తే ఇక ఈ సినిమాను రెండు వారాల వరకు ఎవ్వరు ఆపలేరు.ఇలా సౌత్ సినిమాలు నార్త్ ఇండస్ట్రీలో రచ్చ చేస్తున్నాయి.
దీంతో ఇప్పట్లో అక్కడ సినిమాలు రిలీజ్ అవడం కష్టమే.