టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తాజాగా రామ్ పోతినేని( Ram Pothineni) హీరోగా నటించిన చిత్రం స్కంద( Skanda ) .ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ సెప్టెంబర్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక ఈ సినిమాలో రామ్ కి జోడిగా శ్రీ లీల ( Sreeleela ) నటించారు.ఇలా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ స్థాయిలోనే కలెక్షన్స్ రాబడుతుంది.
ఇక బోయపాటి అంటే యాక్షన్స్ సన్ని వేషాలకు కేరాఫ్ అడ్రస్ అనే విషయం మనకు తెలిసిందే.స్కంద సినిమాలో కూడా రామ్ పోతినేని అదే మాస్ లుక్ భారీ యాక్షన్ సన్నివేశాలలోనే చూపించారు.
ఇలా ఈ యాక్షన్స్ సన్ని వేషాల కోసం బోయపాటి భారీగానే ఖర్చు చేశారని తెలుస్తోంది.
![Telugu Boyapati Sreenu, Ram Pothineni, Saiee Manjrekar, Skanda, Sreeleela, Tolly Telugu Boyapati Sreenu, Ram Pothineni, Saiee Manjrekar, Skanda, Sreeleela, Tolly](https://telugustop.com/wp-content/uploads/2023/10/Ram-Pothineni-Skanda-Boyapati-Sreenu-Tollywood-Sreeleela.jpg)
ఇకపోతే స్కంద సినిమాలోని ఒక సీన్ చేయటానికి మాత్రం బోయపాటి ఏకంగా కోట్లలో ఖర్చు చేయడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది.తాజాగా బోయపాటి శీను ( Boyapati Sreenu ) ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు .ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రామ్ ఇంట్రడక్షన్ సీన్ చేయటం కోసం ఏకంగా కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయనే విషయాన్ని ఈయన వెల్లడించారు.ఈ సినిమాలో రామ్ ఇంట్రడక్షన్ ఒక దున్నపోతుతో ఫైట్ ఉంటుంది.ఈ ఫైట్ కోసం ఏకంగా 4.5 కోట్ల రూపాయలు ఖర్చైందని తెలుస్తోంది.అలాగే ఈ ఫైట్ కోసం 29 జనరేటర్లను ఉపయోగించారట.
![Telugu Boyapati Sreenu, Ram Pothineni, Saiee Manjrekar, Skanda, Sreeleela, Tolly Telugu Boyapati Sreenu, Ram Pothineni, Saiee Manjrekar, Skanda, Sreeleela, Tolly](https://telugustop.com/wp-content/uploads/2023/10/Ram-Pothineni-Skanda-Boyapati-Sreenu-Tollywood-Sreeleela-social-media.jpg)
ఇక బోయపాటి సినిమాలు అంటేనే హీరో ఇంట్రడక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే స్కంద సినిమాలో కూడా ఈయన హీరో రామ్ ను అదే స్థాయిలో ఇంట్రడ్యూస్ చేశారు.అయితే ఈ సన్నివేశం చేయటం కోసం ఏకంగా నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేశారని విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.అయితే ఈ సినిమా ఓపెనింగ్స్ భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టినప్పటికీ ఇప్పుడు మాత్రం భారీగా కలెక్షన్స్ పడిపోయాయని తెలుస్తోంది.
దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది.