కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ( Rahul Gandhi ) ఈ నెల 11న కడపకు రానున్నారు.ఏపీసీసీ అధ్యక్షురాలు, కడప పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి వైఎస్ షర్మి( YS Sharmaila )లకు మద్ధతుగా ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారని తెలుస్తోంది.
వైసీపీ కంచుకోటగా ఉన్న కడప లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని షర్మిల భావిస్తున్నారు.గత ఎన్నికల్లో కడప ఎంపీగా విజయం సాధించిన వైఎస్ అవినాశ్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలవగా.
కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.దీంతో నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది.