ఎన్డీఎ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!!

నేడు ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోదీ( Prime Minister Modi ) కీలక వ్యాఖ్యలు చేశారు.దేశ ప్రగతిని మార్చడంలో ఎన్డీఏ( NDA ) కీలక పాత్ర పోషించిందని స్పష్టం చేశారు.

 Prime Minister Modi's Key Comments In Nda Meeting, Prime Minister Modi, Bjp, Nd-TeluguStop.com

అదేవిధంగా ఎన్డీఏ ఏర్పాటులో అద్వానీ ప్రధాన భూమిక పోషించారని పేర్కొన్నారు.ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో నేడు జరిగిన ఈ సమావేశంలో ఎన్డీఏలో చేరిన కొత్త పార్టీలకు స్వాగతం పలికారు.25 ఏళ్ల నుంచి ఎన్డీఏ దేశ సేవలో ఉందని పేర్కొన్నారు.ఎన్డీఏ దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చమని పేర్కొన్నారు.

రాష్ట్రాల అభివృద్ధి వల్లే దేశాభివృద్ధి సాధ్యమని చెప్పుకొచ్చారు.

వచ్చే 25 ఏళ్ల ప్రణాళికతో ప్రగతి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు.మేక్ ఇన్ ఇండియా నినాదంతో దేశాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు స్పష్టం చేశారు.తమ ప్రభుత్వ హయాంలో ₹13.5 కోట్ల మంది దారిద్యరేఖ దిగువ ఉన్నవారు పైకి వచ్చారని లెక్కలు వివరించారు.ప్రణబ్ ముఖర్జీకి( Pranab Mukherjee ) భారతరత్న ఇచ్చిన ఘనత ఎన్డీఏకే దక్కుతుందని.

ప్రాంతీయ ఆకాంక్షలు నెరవేరుస్తున్నట్లు స్పష్టం చేశారు.ఆదివాసి మహిళను రాష్ట్రపతి చేశామని గాంధీ, అంబేద్కర్, లోహియా సిద్ధాంతాలను ఆచరిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రసంగించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube