శాశ్వత ప్రయాణం మొదలైంది... పరిణితి చోప్రా పోస్ట్ వైరల్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటి పరిణితి( Parineeti Chopra ) చోప్రా తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ చద్దా( Raghav Chadda ) వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.వీరి వివాహం ఉదయపూర్ లోని లీలా ప్యాలెస్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది ఇక వీరి వివాహం వరకు కూడా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను బయటకు రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.

 Parineeti Chopra First Post After Her Marriage Post Goes Viral In Social Media-TeluguStop.com

వివాహం అనంతరం స్వయంగా పరిణితి చోప్రా సోషల్ మీడియా వేదికగా వీరి పెళ్లి ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.

ఇలా విరి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే ఈ ఫోటోలతో పాటు పరిణితి చోప్రా వారి ఇద్దరి మధ్య ఏర్పడినటువంటి బంధం గురించి కూడా ఈ సందర్భంగా ఈమె తెలియజేస్తూ చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది.మా మధ్య మాటలు మొదలైనటువంటి తొలి సందర్భంలోనే మా హృదయాలకు తెలుసు ఇలాంటి రోజు తప్పకుండా వస్తుందని.

ఈరోజు కోసం మేం ఎంతగానో ఎదురు చూసాం చివరికి ఆ కల నెరవేరింది.మేము కలిసి నడిచే శాశ్వత ప్రయాణం ఇప్పుడే మొదలైంది అంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

ఇలా పరిణితి చోప్రా తమ పెళ్ళి ఫోటోలను షేర్ చేస్తూ రాఘవ్ తో తన ప్రయాణం ఎలా మొదలైంది అనే విషయాల గురించి తెలియజేస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది.ఇక వీరిద్దరూ కాలేజీ చదివే సమయంలోనే ప్రేమలో పడ్డారని అప్పటినుంచి వీరీ ప్రేమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ పెద్దల అంగీకారంతో పెళ్లి బంధంతో ఒకటయ్యారు.ఇక పరిణితి చోప్రా బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకోగా రాఘవ్ చిన్నవయసులోనే ఎంపీగా కొనసాగుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube