అమరావతి రైతుల పాదయాత్ర పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.రైతులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.
హైకోర్టు షరతులకు లోబడే పాదయాత్ర జరగాలని తెలిపింది.ధర్మాసనం ఆదేశాలను సవరించేది లేదని కోర్టు స్పష్టం చేసింది.
పాదయాత్రలో పాల్గొనకుండా ఎవరైనా సంఘీభావం తెలపవచ్చని పేర్కొంది.ఈ క్రమంలోనే పాదయాత్ర రద్దు చేయాలని డీజీపీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ ను కూడా న్యాయస్థానం కొట్టివేసింది.
రైతులు షరతులు ఉల్లంఘిస్తే హైకోర్టును ఆశ్రయించవచ్చని డీజీపీకి స్పష్టం చేసింది.అదేవిధంగా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించొద్దని రైతులకు హెచ్చరికలు జారీ చేసింది.