తెలంగాణలో పెండింగ్ చలాన్లకు( Pending Challans ) విశేష స్పందన వస్తోంది.రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3 కోట్ల 59 లక్షల పెండింగ్ చలానాలు ఉన్నాయి.
గత నెల 26వ తేదీ నుంచి నిన్నటి వరకు సుమారు 76 లక్షల 79 వేల చలానాలను వాహనదారులు చెల్లించారు.దాదాపు 11 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.66 కోట్ల 77 లక్షల ఆదాయం వచ్చింది.ఇటీవలే వాహనదారులకు గుడ్ న్యూస్ చెబుతూ తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) పెండింగ్ చలాన్లపై రాయితీని ప్రకటించింది.
ఈనెల 10వ తేదీ వరకు వాహనదారులకు పెండింగ్ చలాన్లపై రాయితీతో చెల్లింపులకు అవకాశం ఉంది.
దీంతో వాహనదారులు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వాహనాలపై ఉన్న పెండింగ్ చలానాలను క్లియర్ చేసుకుంటున్నారు.హైదరాబాద్ కమిషనరేట్( Hyderabad Commissionerate ) పరిధిలో రూ.17 కోట్ల చెల్లింపులు జరగగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో రూ.7.17 కోట్లు చెల్లింపులు జరిగాయి.అదేవిధంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూ.13.99 కోట్లు చెల్లింపులు జరిగాయి.అయితే చెల్లింపులకు ఇంకా ఐదు రోజుల సమయం ఉండటంతో ప్రభుత్వానికి మరింతగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.