దసరా సందర్భంగా బిఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల ర్యాలీ

పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ( Vemulawada ) పట్టణంలోని మహాలక్ష్మి వీధి బిఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో దసరా సందర్భంగా జమ్మి చెట్టుకు పూజలు చేసి ఎడ్లబండ్ల ర్యాలీ( Bull Cart Rally )ని నిర్వహించిన కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేములవాడ పట్టణ ప్రజలందరికీ, మంత్రి కేటీఆర్, శాసనసభ్యులు రమేష్ బాబు, వేములవాడ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు( Chalmeda Lakshmi Narasimha Rao ), అధికారులకు,అనధికారులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.

 On The Occasion Of Dussehra, The Edla Bandla Rally Was Organized Under The Auspi-TeluguStop.com

చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా విజయదశమి పండుగను జరుపుకుంటామని తొమ్మిది రోజుల పాటు ఆ దుర్గా అమ్మవారిని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేసి 9వ రోజున విజయదశమి పండుగను జరుపుకుంటామని అన్నారు.

విజయదశమి( Vijayadashami ) ప్రజలందరికీ విజయాలు కలిగించాలని ఆ దుర్గాదేవి ఆశీస్సులు చల్లని దీవెనలు మనందరిపై ఉండి చేసే పనులలో విజయాలు కలగాలని పాడిపంట సమృద్ధిగా పండి రైతుల ఇంట ఎప్పుడు పండుగ వాతావరణం ఉండాలని మన సంస్కృతి సాంప్రదాయాలు కు అద్దంపట్టే విధంగా ఈ ఎడ్లబండ్ల ర్యాలీ ని నిర్వహించడం చాలా సంతోషకరమని వారన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పుల్కం రాజు,ఎంపీపీ బండ మల్లేశం ,స్థానిక కౌన్సిలర్లు మారం కుమార్,జడల లక్ష్మీ శ్రీనివాస్ ,గౌరవ కౌన్సిలర్లు, బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube