రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్ర నగర్ లో నకిలీ చాక్లెట్స్ తయారీ దందా జోరుగా కొనసాగుతోంది.ప్రమాదకరమైన రసాయనాలతో చాక్లెట్స్ తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే హైదర్ గూడలో ఈ దందా సాగుతుందని తెలుస్తోంది.పరిశ్రమలో ఎక్కడా నాణ్యతా ప్రమాణాలు కనిపించడం లేదు.
కుళ్లిన చింతపండు గుజ్జుతో ఈ చాక్లెట్లను తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది.అయితే నకిలీ చాక్లెట్లను విక్రయిస్తూ చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా చాక్లెట్ల తయారీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.