మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘క్రాక్’ అన్ని పనులు పూర్తి చేసుకుని నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తూ వస్తున్నారు.
ఎట్టకేలకు థియేటర్లలో ఈరోజు మాస్ రాజా రవితేజ బొమ్మ పడుతుండటంతో ఈ సినిమాను ముందుగానే చూసేందుకు ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.ఇక ఈ సినిమాకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు వేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు ప్లాన్ చేశారు.
కానీ చివరి నిమిషంలో ప్రీమియర్ షోలు లేవంటూ వారు తేల్చి చెప్పారు.డిస్ట్రిబ్యూషన్ పనుల్లో తలెత్తిన సమస్య కారణంగా క్రాక్ చిత్రం ప్రీమియర్ షోలు క్యాన్సిల్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
దీంతో ఎంతో ఆసక్తిగా తెల్లవారుజామునే థియేటర్లకు పరుగులు తీసిన రవితేజ అభిమానులు నిరాశతో వెనుదిరిగారు.ఉదయం 8.45కు క్రాక్ బొమ్మ పడాల్సి ఉంది.కానీ ఈ సినిమా నిర్మాత మధు సినిమా పనిపై చెన్నైలో ఉండిపోయారు.దీంతో కొన్ని సమస్యలు తలెత్తాయని, అందుకే ఉదయం 8.45 షోను క్యాన్సిల్ చేస్తున్నట్లు చిత్ర డిస్ట్రిబ్యూటర్లు తెలిపారు.అయితే ఉదయం 10 గంటల షో ఖచ్చితంగా ఉంటుందని వారు అంటున్నారు.
దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో రవితేజ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.అందాల భామ శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోండగా, వరలక్ష్మీ శరత్ కుమార్, సముథ్రకణి ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.మరి క్రాక్ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.