టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై ఒక ట్రోల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.చంద్రబాబు నాయుడు లాగే.
నారా లోకేష్ ది కూడా ఐరన్ లెగ్ అని ఆయన ప్రత్యర్థులు విమర్శలు ఎక్కుపెడుతున్నారు.ఇక రంగంలోకి మంత్రి రోజ ఎంటర్ కావడంతో.
సోషల్ మీడియా పోస్టులు కాస్తా.పొలిటికల్ వివాదానికి దారి తీశాయి.
నారా లోకేష్ ది ఐరన్ లెగ్ అని మంత్రి రోజా కామెంట్ చేశారు.దాంతో మామూలు వైరల్ పోస్టు కాస్తా పొలిటికల్ రంగు పులుముకుంది.
మంత్రి రోజా కామెంట్స్ పై తెలుగు దేశం నేతలు తెగ మండిపడుతూ ఉన్నారు.
చంద్రబాబు సభల్లోల జనం చనిపోతున్నా పట్టించుకోకుండా.
తన రాజకీయ స్వలాభాన్ని చూసుకుంటూ ఉన్నారని వైసీపీ నేతలు అంటున్నారు.మొన్నటికి మొన్న జరిగిన నెల్లూరు, గుంటూరులలో విషాద ఘటన జరిగినా కూడా.
నెక్స్ట్ డే నే చంద్రబాబు తన రోడ్డు షోలను బహిరంగ సభలను కంటిన్యూ చేశారు.దాంతో వైసీపీ నేతలు ఆయనపై విరుచుకుపడ్డారు.
అంతే కాకుండా చంద్రబాబుకు ప్రాణాల కంటే.పదవి పైనే కాంక్ష ఎక్కువని కూడా విమర్శలు చేశారు.
యువగళం పేరుతో నారాలోకేష్ పాదయాత్ర మొదలు పెడితే అది కూడా ఇప్పుడు వివాదాలకు అడ్డాగా మారింది.టీడీపీ కోసం కదం కలిపిన తారక రత్న అకాస్మాత్తుగా ఆస్పత్రి పాలయ్యారు.తారక రత్న సొమ్మసిల్లి పడిపోయనా.నారా వారు పట్టించుకోకుండా.తమ కార్యక్రమాలపైనే ఫొకస్ చేశారని విమర్శకులు అంటున్నారు.లోకేష్ కూడా తన పాదయాత్రను కంటిన్యూ చేస్తూ.
బహిరంగ సభకు హాజరు అయ్యారు.దాంతో అటు సోషల్ మీడియాతో పాటు.ఇటు ప్రత్యర్థులు కూడా ఆయన విధానాన్ని తప్పుపడుతున్నారు.
ఇక నారా లోకేష్ తో పాటు చంద్రబాబు నాయుడుది ఐరన్ లెగ్ అని.అందుకే వాళ్ల సభల్లో సామాన్యుల దగ్గరి నుంచి సొంత బంధువుల వరకూ ప్రాణాలు కొల్పోతున్నారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.ఒక వేళ పొరపాటున తారక రత్నకు జరగరానిది కానీ జరిగితే.
నారా లోకేష్ కు వైసీపీ నేతలు ఐరన్ లెగ్ అనే ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.అదే గానీ జరిగితే.అది టీడీపీకి పెద్ద మైనస్ గా మారే అవకాశం ఉంది.కాళ్లా వేళ్లా పడైనా సరే జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకు వచ్చి.
ఆముద్రను చేరిపేసుకునే దాకా.లోకేష్ ఈ బారాన్ని మోయాల్సి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.