పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన చిత్రం భీమ్లా నాయక్.ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించగా, సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మించారు.ఈ సినిమాలో హీరో రానా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యమీనన్ హీరోయిన్ గా నటించింది.ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్ర యూనిట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు.
ఈ సందర్భంగా కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ మాట్లాడుతూ.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ కి థాంక్యూ.
ఇన్ని రోజులు నాకు మంచి సాంగ్స్ ఇస్తూ నన్ను ప్రోత్సహిస్తూ వస్తున్నారు.అదేవిధంగా మళ్లీ తన సినిమాకు పాటలు ఇచ్చి నన్ను ప్రోత్సహించారు.
పవన్ కళ్యాణ్ సార్ కి, అదేవిధంగా నిర్మాత గారికి, త్రివిక్రమ్ గారికి, దర్శకుడికి చాలా థ్యాంక్స్.పవన్ కళ్యాణ్ సార్ తో పనిచేయడం నిజంగా నా అదృష్టం.
అది గత కొన్నేళ్లుగా నాకు దొరుకుతోంది అని చెప్పుకొచ్చారు గణేష్ మాస్టర్.ఆ దేవుడికి థాంక్స్.
ఎందుకంటే ఈ దేవుడి దగ్గర పనిచేసే అవకాశం ఆ దేవుడు ఇచ్చాడు.నిజంగా ఆ దేవుడికి థ్యాంక్స్.
నేను ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను అని చెప్పుకొచ్చారు గణేష్ మాస్టర్.
ఇకపోతే గణేష్ మాస్టర్ తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఢీ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.ఇక బీమ్లా నాయక్ సినిమా విషయానికి వస్తే.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు, టీజర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమా రేపు అనగా ఫిబ్రవరి 25న విడుదల కానున్న విషయం తెలిసిందే.ఇప్పటికే థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది.