టిడిపి సీనియర్ నేత , మాజీ మంత్రి బండారు సత్యనారాయణ( Bandaru satyanarayana ) ఇటీవల ఏపీ మంత్రి రోజాను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై వైసీపీ ప్రభుత్వం సీరియస్ కావడంతో పాటు , పోలీసులతో అరెస్టు చేయించింది.
ఈ వ్యవహారం పెద్ద దుమారమే రేగింది.ఈ వ్యవహారంలో బండారును పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇక ఆ తరువాత బెయిల్ పై బయటకు వచ్చిన బండారు అదే వైఖరితో ఉండడం, రోజాను టిడిపి శ్రేణులు ట్రోల్ చేస్తూ ఉండడం పై , వైసీపీ( YCP ) సీరియస్ గానే ఉంది.ఈ వ్యవహారం ఇలా ఉంటే ఇప్పుడు రోజాకు మద్దతుగా మాజీ హీరోయిన్లు తెరపైకి వచ్చారు.
రోజాకు మద్దతుగా మాట్లాడుతూ బండారు సత్యనారాయణ క్షమాపణ చెప్పాల్సిందేనని మహారాష్ట్రలోని అమరావతి లోక్ సభ సభ్యురాలు నవనీత్ కౌర్ నటి , రాధిక శరత్ కుమార్, కుష్బూ, మీనా, రమ్యకృష్ణ, తదితరులు వీడియో విడుదల చేసి బండలు సత్యనారాయణ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .
ఒకరి తర్వాత ఒకరు ఈ వ్యవహారంపై స్పందిస్తూ బండారు వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.సుప్రీంకోర్టు కూడా బండారు వ్యాఖ్యలపై స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు .మంత్రి రోజా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన సమయం నుంచి తనకు తెలుసునని, రోజా( Roja ) చిత్తశుద్ధితో హార్డ్ వర్క్ చేసే మహిళ అని నటి మీన( Meena ) అన్నారు.రోజా నటిగా ,తల్లిగా, రాజకీయ నాయకురాలుగా మహిళగా అన్నింట సక్సెస్ అయిన వ్యక్తి అని, రోజా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడే అర్హత బండారు సత్యనారాయణకు లేదని మీన ఫైర్ అవుతున్నారు.మంత్రి రోజా చేసే పోరాటానికి తాను మద్దతుగా నిలుస్తానని మీన ప్రకటించారు.
ఇక ఇదే అంశంపై నటి రమ్యకృష్ణ కూడా స్పందించారు. మహిళలకు శారీరక మానసిక హింసను అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
బండారుపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.ఆయన పై చర్యలు తీసుకోవాలని రమ్య కృష్ణ డిమాండ్ చేశారు .సినీనటి మాజీ టిడిపి మహిళా నేత కవిత( Kavitha ) సైతం బందారు వ్యాఖ్యలను తప్పుపట్టారు. రోజా పై బండారు వ్యాఖ్యలను భువనేశ్వరి, బ్రాహ్మణి ఖండించాలని కవిత డిమాండ్ చేస్తున్నారు.
ఇదే విధంగా తెలుగు సిని రంగానికి చెందిన మాజీ హీరోయిన్ లు అంతా రోజాకు బాసటగా నిలుస్తూ బండారు సత్యనారాయణ పై ఫైర్ అవుతున్నారు.