తంగళ్ళపల్లి మండల ముదిరాజ్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

రాజన్న సిరిసిల్ల జిల్లా ముదిరాజ్ సంక్షేమ సంఘం( Mudiraj Welfare Society ) ఆధ్వర్యంలో తంగళ్లపల్లి మండలం ముదిరాజ్ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడు గా జంగపెల్లి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు గా వంకాయల భాస్కర్, గౌరవ అధ్యక్షులు గా దేవుని నర్సయ్య, ప్రధాన కార్యదర్శి కూనవేణి పర్శరాము ముదిరాజ్ లను జిల్లా సంక్షేమ సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్బంగా జిల్లా ముదిరాజ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రానవేణి లక్ష్మణ్ మాట్లాడుతూ జిల్లాలో ముదిరాజ్ ఐక్యత మొదలైందని అన్నారు.

 Election Of New Working Committee Of Tangallapally Mandal Mudiraj Welfare Associ-TeluguStop.com

మొన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) కేంద్రం లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభకు కోడి అంతయ్య జిల్లా ముదిరాజ్ లు మద్దతు తెలుపుతున్నారని ఓ తీర్మానం కాపీని కేసీఆర్ కు అందిచడాన్ని జిల్లా ముదిరాజ్ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు.జిల్లా నుండి బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి మద్దతు తెలియజేయలేదని తెలిపారు.బీఆర్ఎస్ పార్టీ కి మా ఓట్లు కావాలే గాని మేము అక్కర లేదని పార్టీ పై మండిపడ్డారు.13 మండలాల జిల్లా ముదిరాజ్ సంక్షేమ సంఘం అధ్యక్షులతో మాట్లాడిన తర్వాతనే మా భవిష్యత్తు కార్యాచరణ మద్దత్తు ను ప్రకటిస్తామని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube