బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్లలో మొట్టమొదటి సారిగా ఒక అమ్మాయి టాప్ ఫైవ్ ఉండి రికార్డ్ సృష్టించిన సిరి హనుమంతు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఒక యూట్యూబర్ గా సోషల్ మీడియాలో ఎంతో మంచి పాపులారిటీ దక్కించుకొని బిగ్ బాస్ అవకాశాన్ని దక్కించుకున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా సిరి మరింత పాపులర్ అయింది.బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత సిరి కంటెస్టెంట్ షణ్ముఖ్ జశ్వంత్ తో కలిసి ఈమె చేసిన రొమాన్స్ ఈమెకు మరింత గుర్తింపు తెచ్చిందనే చెప్పాలి.
హౌస్ లో షణ్ముఖ్ జశ్వంత్ తో కలిసి ఈమె హగ్గులు, కిస్ లు కారణంగా పెద్ద ఎత్తున పాపులర్ అయ్యారు.ఇదే పాపులారిటీతోనే సిరి టాప్ ఫైవ్ లో నిలబడింది.
ఇక టాప్ ఫైవ్ లో ఉన్నటువంటి ఈమె టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చారు.హీరోయిన్ రష్మిక మందన్నా, దేవిశ్రీప్రసాద్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి సిరిని బయటకు తీసుకువచ్చారు.
బిగ్ బాస్ మొదటి వారం నుంచి నామినేషన్స్ లో ఉంటూ 15 వ వారం వరకు కొనసాగిన సిరిని పటాకా ఆఫ్ ద బిగ్బాస్ హౌస్ అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించాడు.
ఇలా బిగ్ బాస్ హౌస్ లో 15 వారాలు కొనసాగుతూ ప్రతి ఒక్క కంటెస్టెంట్ కి స్ట్రాంగ్ గా పోటీ ఇస్తూ టాస్క్ ల విషయంలో ఆమె గొడవలు పడి అందులో గెలవాలన్న పట్టుదలతో ఎంతో శ్రమించింది.ఇలా టాస్క్ విషయంలో సిరి కొన్నిసార్లు గాయాలపాలైన సంగతి కూడా తెలిసిందే.ఇలా మొండి పట్టుదలతో ఎలాగైనా టైటిల్ గెలవాలన్న కసితో టాప్ ఫైవ్ లో చేరింది.
సిరి బిగ్ బాస్ హౌస్ కి వెళ్లక ముందు వివిధ సీరియల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తూ సుమారు లక్ష నుంచి లక్షన్నర వరకు సంపాదించేదని తెలుస్తోంది.ఇదే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని బిగ్ బాస్ ఈమె 15 వారాలపాటు బిగ్ బాస్ హౌస్లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసినందుకు గాను సుమారు పాతిక లక్షల వరకు గెలుచుకున్నట్లు తెలుస్తోంది.
సిరి ఇలా టాప్ ఫైవ్ లో ఉండి ముందుగా బిగ్ బాస్ తో కుదుర్చుకున్న డీల్ ప్రకారం పాతిక లక్షలు మాత్రమే కాకుండా ఈమె ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసిన విధానాన్ని దృష్టిలో ఉంచుకొని తనకు మరి కొంత మొత్తంలో రెమ్యూనరేషన్ అందించి ఉంటారని తెలుస్తోంది.ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సిరి 15 వారాలపాటు తనకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఇలా బిగ్ బాస్ హౌస్ నుంచి తను కంటెస్టెంట్ గా బయటకు రావడంతో తనకు ఏమాత్రం బాధ లేదని సిరి బిగ్ బాస్ వేదికపై తెలిపారు.అలాగే తన తల్లి తన గురించి అన్న మాటలకు ఆ తర్వాత బాధపడిందనే విషయాన్ని నాగార్జున చెప్పగా.
నాకు తెలుసు ఇది ఖచ్చితంగా మా అమ్మ మనసులో నుంచి వచ్చిన మాట కాదు అంటూ మరొకసారి తన ప్రేమను వ్యక్తపరిచారు.