టాలీవుడ్ లో వేగంగా సినిమాలు తెరకెక్కించే దర్శకుడిగా, సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న దర్శకుడిగా పూరీ జగన్నాథ్ కు పేరుంది.స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి పూరీ జగన్నాథ్ గురించి మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు.
సినిమాసినిమాకు ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్న వంశీ పైడిపల్లి వరుసగా విజయాలను సొంతం చేసుకుంటూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు.వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా ఒక సినిమా తెరకెక్కనుంది.
మహర్షి సక్సెస్ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.వంశీ పైడిపల్లి మాట్లాడుతూ తాను ముందుగా దర్శకుడినని ఆ తర్వాత రచయితనని చెప్పుకొచ్చారు.
సినిమా కథకు సంబంధించి ఏదైనా మంచి ఐడియా వస్తే ఆ ఐడియాను తాను వెంటనే డెవలప్ చేయలేనని వంశీ పైడిపల్లి పేర్కొన్నారు.తాను రచయితలతో కూర్చుని తన ఐడియా వాళ్లకు చెప్పగా రచయితలు తనకు మరో విధంగా చెబుతారని వంశీ పేర్కొన్నారు.
ఈ కారణాల వల్లే తన డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలకు సంబంధించి ఆలస్యం అవుతోందని వంశీ కామెంట్లు చేశారు.మనస్సుకు నచ్చే వరకు ఈ ప్రాసెస్ కొనసాగుతుందని కొన్నిసార్లు ఎంతో ఒత్తిడిని తీసుకుంటానని వంశీ చెప్పుకొచ్చారు.రెండు వారాలలో పూరీ జగన్నాథ్ కథ రాసేస్తారని ఆయనకు దండం పెడతానని వంశీ వెల్లడించారు.కొంతమంది రైటర్స్ తో కలిసి విజయ్ సినిమా కొరకు పని చేస్తున్నానని వంశీ కామెంట్లు చేశారు.
విజయ్ సినిమా సెట్స్ పైకి రావడానికి కొంత సమయం పడుతుందని ఆ సమయంలో ఈ సినిమా కథకు సంబంధించిన చిన్నచిన్న మార్పులు చేస్తానని వంశీ వెల్లడించారు.దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండగా వంశీ ఈ సినిమాతో మరో సక్సెస్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది.