తెలంగాణ శాసనమండలిలో కరోనా కలకలం.. !

ఈ కరోనా మనల్ని ఏం చేస్తుందని ఇంత కాలం ప్రజలు అనుకున్నారు.కానీ ఇంకా నేను పోలేదు.

 Corona Agitation In Telangana Legislature Telangana, Trs, Mla Puranam Sathish, D-TeluguStop.com

మీతోనే ఉన్నాను అంటూ మరోసారి ప్రజలను పలకరించడానికి వచ్చింది ఈ వైరస్.ఈ క్రమంలో తెలంగాణలో మరోసారి పంజా విసురుతోంది.

రోజు రోజుకు ఊహించని విధంగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదవుతున్న తీరుకు ప్రభుత్వం కూడా కఠినమైన చర్యలకు ఊపక్రమించింది.ముఖ్యంగా ప్రజల్లో బాధ్యత ఉంటే కరోనాను నియంత్రించ వచ్చు.

కానీ అదే లోపించింది.ఇకపోతే తాజాగ తెలంగాణ శాసనమండలిలో కరోనా కలకలం సృష్టిస్తుంది.

ఇద్దరు ఎమ్మెల్సీలు అయినా పురాణం సతీష్, దామోదర్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది.

వీరిద్దరూ కూడ శనివారం మండలికి హాజరైనారు.

దీంతో ఇతర సభ్యుల్లో కూడా కలవరం మొదలైంది.ఇకపోతే గత ఐదు రోజులుగా తనతో ప్రైమరీ కాంటాక్ట్ లోని వచ్చిన వారంతా కోవిడ్ పరీక్షలు చేయించు కోవాలని, హోమ్ ఐసొలేషన్ లో ఉండాలని తనను కలిసిన వారిని వీరు కోరుతున్నారు.

ఇదిలా ఉండగా కరోనా నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ముందుగానే ముగించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube