అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా ఖమ్మం భరోసా కేంద్రంలో అందిస్తున్న విశిష్ట సేవలకు గాను ఉమెన్ అచీవర్ అవార్డ్-2023 నీ భరోసా కేంద్రం కో ఆర్డినేటర్ గుండ రాజ కుమారి పొందారు.ఖమ్మం జిల్లాకు చెందిన గుండ రాజ కుమారి పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న భరోసా సెంటర్ లో కో ఆర్డినేటర్ గా విధులునిర్వహిస్తున్నారు.
హనుమకొండలోని కాకతీయ విద్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ రాజ కుమారి నీ బుధవారం ఘనంగా సత్కరించి, రాష్ట్ర ప్రబుత్వం అందజేసిన లక్ష రూపాయలు నగదుతో పాటు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను రాజ కుమారికి ప్రదానం చేశారు.అవార్డ్ నీ పొందిన రాజ కుమారి నీ ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ అభినందించారు.
పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ అంజలి, భరోసా ఇంచార్జ్,షీ టీం ఎస్సై ఉమా పాల్గొన్నారు.