ఏపీ సీఎం వైఎస్ జగన్ గురువారం మే ఐదో తారీకు శ్రీ బాలాజీ జిల్లా కేంద్రం తిరుపతి లో పర్యటించనున్నారు.ఈ పర్యటనలో “జగనన్న విద్యా దీవెన” కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు.
విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులతో జగన్ మాట్లాడనున్నారు.అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
సీఎం జగన్ తిరుపతి పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఏపీ ప్రభుత్వం బుధవారం విడుదల చేయడం జరిగింది.షెడ్యూల్ డీటెయిల్స్ చూస్తే… గురువారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న జగన్… 11.05 గంటలకు తిరుపతి ఎస్వీ వెటర్నరీ కాలేజ్ గ్రౌండ్స్కు చేరుకుంటారు.
ఆ తర్వాత 11.20 గంటలకు ఎస్వీ యూనివర్శిటీ స్టేడియం చేరుకుని ‘జగనన్న విద్యాదీవెన’ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సంభాషణ, అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:55 గంటలకు శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి చేరుకుంటారు.అనంతరం టిటిడి చిన్న పిల్లల ఆసుపత్రి భవనం నిర్మాణానికి సంబంధించి భూమి పూజలో పాల్గొననున్నారు.
ఆ తర్వాత అక్కడి నుండి ఇ వివిధ కార్యక్రమాలలో పాల్గొని అనంతరం టాటా క్యాన్సర్ కేర్ సెంటర్ కి చేరుకుని అక్కడ మరో నూతన …
.