రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం( Boinpalli Mandal ) మనువాడ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త జనగాం బాబుఇటీవల గుండెపోటుతో వచ్చి చెందాడు.స్థానిక బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో కలిసిఎమ్మెల్యే రవిశంకర్ ( RaviShankar )కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చురుకైన కార్య కర్త మరణించడం చాలా దురదృష్టకరం అని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్ననని వారికి బిఆర్ఎస్ ప్రభుత్వం( BRS ), మేము అందరం అండగా ఉంటామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు.
ఆయన వెంట జెడ్పీటీసీ కత్తెరపాక ఉమా కొండయ్య , బిఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తెర పాక కొండయ్య, ఎంపిటిసి ఐరెడ్డి గీత మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిక్కాల సుధాకర్ రావు, బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు కట్ట గోవర్థన్ గౌడ్,( Katta Goverthan Goud ) ఉప సర్పంచ్ మోతె ఎల్లారెడ్డి, మల్లాపూర్ సర్పంచ్ శంకరయ్య, బిఆర్ఎస్వి మండల ఆధ్యక్షుడు వరుణ్, బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు తాల్లపెళ్ళి రాజేశం, యూత్ అధ్యక్షులు కర్నె నరేష్, సంజీవ్, జీవన్, కార్తిక్, రాజు తదితరులు పాల్గొన్నారు.