సిరిసిల్ల డిపో నుండి హైదరాబాద్ ,యాదగిరి గుట్ట కు బస్ నడపండి..ఒగ్గు బాలరాజు యాదవ్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట,గొల్లపల్లి మీదుగా కామారెడ్డి నుండి హైదరాబాద్ కు సిరిసిల్ల ఆర్ టి సి డి పో నుండి బస్ నడపాలని కోరుతూ ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ సోమవారం మండల తహసీల్దార్ కార్యాలయం లో జరిగిన ప్రజావాణిలో మండల తహసీల్దార్ జయంత్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు.

 Drive A Bus From Sirisilla Depot To Hyderabad, Yadagiri Gutta..oggu Balaraju Yad-TeluguStop.com

ఎల్లారెడ్డి పేట, గొల్లపల్లి గ్రామాలలో వ్యాపార ,వాణిజ్య దుకాణాలను నిర్వహించే వారు వ్యాపారం నిమిత్తం ప్రతిరోజూ హైదరాబాద్ వెళుతున్నారని సిరిసిల్ల నుండి హైదరాబాద్ కు బస్ సౌకర్యం లేక రాత్రి అవుతే బస్ స్టాండ్ లలో ఉండాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు.

అదే విధంగా ప్రముఖ పుణ్యక్షేత్రం గా ఉన్న యాదగిరి గుట్ట కు సిరిసిల్ల డిపో నుండి ఎల్లారెడ్డి పేట, గంభీరావు పేట, ముస్తాబాద్,సిద్దిపేట మీదుగా యాదగిరి గుట్ట కు బస్ సౌకర్యం ఏర్పాటు చేయాలని మండల తహశీల్దార్ జయంత్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube