సిరిసిల్ల డిపో నుండి హైదరాబాద్ ,యాదగిరి గుట్ట కు బస్ నడపండి..ఒగ్గు బాలరాజు యాదవ్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట,గొల్లపల్లి మీదుగా కామారెడ్డి నుండి హైదరాబాద్ కు సిరిసిల్ల ఆర్ టి సి డి పో నుండి బస్ నడపాలని కోరుతూ ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ సోమవారం మండల తహసీల్దార్ కార్యాలయం లో జరిగిన ప్రజావాణిలో మండల తహసీల్దార్ జయంత్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు.

ఎల్లారెడ్డి పేట, గొల్లపల్లి గ్రామాలలో వ్యాపార ,వాణిజ్య దుకాణాలను నిర్వహించే వారు వ్యాపారం నిమిత్తం ప్రతిరోజూ హైదరాబాద్ వెళుతున్నారని సిరిసిల్ల నుండి హైదరాబాద్ కు బస్ సౌకర్యం లేక రాత్రి అవుతే బస్ స్టాండ్ లలో ఉండాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు.

అదే విధంగా ప్రముఖ పుణ్యక్షేత్రం గా ఉన్న యాదగిరి గుట్ట కు సిరిసిల్ల డిపో నుండి ఎల్లారెడ్డి పేట, గంభీరావు పేట, ముస్తాబాద్,సిద్దిపేట మీదుగా యాదగిరి గుట్ట కు బస్ సౌకర్యం ఏర్పాటు చేయాలని మండల తహశీల్దార్ జయంత్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు.

రెమ్యునరేషన్స్‌ భారీగా పెంచేసిన టాలీవుడ్ డైరెక్టర్స్‌.. ఎంతో తెలిస్తే..?