మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఇండస్ట్రీకి పెద్దగా ఉండనని సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.చిరంజీవి చేసిన వ్యాఖ్యల గురించి ఇండస్ట్రీ వర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది.
అయితే తాజాగా చిరంజీవి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈరోజు ఆక్సిజన్ బ్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన చిరంజీవి కొంతమంది అవసరం వచ్చిన సమయంలో తమ బుద్ధిని చూపిస్తారని చెప్పుకొచ్చారు.
అయితే తాను మాత్రం ఎదుటివాళ్ల మంచిని కోరుకుంటానని చిరంజీవి పేర్కొన్నారు.తాను సేవా కార్యక్రమాలను మొదలు పెట్టిన సమయంలో ఫ్యాన్స్ కు ఒకటే విషయం చెప్పానని చిరంజీవి అన్నారు.
తాను ఇచ్చిన పిలుపుకు స్పందించి ఫ్యాన్స్ వచ్చారంటే వాళ్లలో నా స్పందన వ్యక్తమైందని అనుకుంటానని చిరంజీవి అన్నారు.నిజాయితీ, సంయమనం, చిత్తశుద్ధి మనకు విజయాలను అందిస్తాయని చిరంజీవి చెప్పుకొచ్చారు.
ఏ విషయం గురించి కళ్యాణ్ బాబు మాట్లాడినా తన స్పందన సబబుగా ఉంటుందని చిరంజీవి పేర్కొన్నారు.కొన్ని అంశాల విషయంలో పవన్ కళ్యాణ్ స్పందన సమంజసమే అని తనకు అనిపిస్తోందని చిరంజీవి చెప్పుకొచ్చారు.పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా న్యాయం కోసమే మాట్లాడతాడని చిరంజీవి కామెంట్లు చేశారు.పవన్ త్వరగా స్పందిస్తాడని తాను స్పందించడానికి సమయం తీసుకుంటానని చిరంజీవి చెప్పుకొచ్చారు.
చిరంజీవి వరుసగా సంచలన వాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.చిరంజీవి వివాదాస్పద అంశాల గురించి స్పందిస్తూ ఉండటంపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.చిరంజీవి బుద్ధి చూపిస్తారని ఎవరిని అన్నారనే చర్చ కూడా సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది.మరోవైపు చిరంజీవి నటించిన ఆచార్య వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
ఈ వార్తలపై ఆచార్య మేకర్స్ స్పందించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.టాలీవుడ్ లో పెద్ద సినిమాలు వరుసగా వాయిదా పడుతుండటం గమనార్హం.