విజయనగరం బర్రిపేట దగ్గర సముద్రంలో పడవ బోల్తా..!!

విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.బర్రిపేట దగ్గర సముద్రంలో పడవ బోల్తా పడింది.

ఈ ప్రమాద ఘటనలో వాసుపల్లి అప్పన్న అనే మత్స్యకారుడు మృతి చెందాడు.ఇదే సమయంలో సురక్షితంగా ఆరుగురు మత్స్యకారులు ప్రమాదం నుండి బయటపడ్డారు.

సముద్రంలోకి వేటకు వెళ్లిన క్రమంలో మిగతా ఆరుగురుతో కలిసి వాసుపల్లి అప్పన్న చేపలు పట్టాలని ప్రయత్నించటం జరిగింది.అయితే కొంత దూరం వెళ్లిన తర్వాత రాకాసి అలల ఉధృతికి పడవ బోల్తా పడటంతో మొత్తం ఏడుగురు నీటిలో పడిపోయారు.

ఈ క్రమంలో ఆరుగురు చాలా కష్టపడి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు.అయితే వాసుపల్లి అప్పన్న మాత్రం.సముద్రంలోనే మరణించడం జరిగింది.కాగా బోల్తా పడిన పడవ ప్రమాద ఘటన వద్దకు తర్వాత చేరుకుని మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకొచ్చారు.ఈ ఘటనతో వాసుపల్లి అప్పన్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.ఇదే క్రమంలో తోటి మత్స్యకారుల సైతం కన్నీరు పెట్టుకున్నారు.

ఒక్కసారిగా సముద్రంలో రాకాసి అలలు ఎగసిపడటంతో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడటంతో ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం.మిగతా ఆరుగురు సురక్షితంగా ప్రాణాపాయం నుండి బయటపడటంతో వాళ్ల కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube