మార్కెట్లోకి ఎప్పటికప్పుడు పెద్ద సంఖ్యలో స్మార్ట్ ఫోన్లు విడుదల అవుతున్నాయి.సరికొత్త ఫీచర్లు, ఆకర్షణీయమైన లుక్తో అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
ఫిబ్రవరి నెలలో ఒప్పో ఫైండ్ ఎన్2 సిరీస్, శామ్సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ ఫోన్లు విడుదలై అనూహ్య రీతిలో అమ్ముడయ్యాయి.తాజాగా మార్చి నెలలోనూ మార్కెట్లోకి అధునాతన ఫోన్లు విడుదల కానున్నాయి.
కళ్లు చెదిరే ఫీచర్లు, డైనమిక్ లుక్తో కూడిన ఫోన్లను ప్రముఖ బ్రాండ్ల కంపెనీలు లాంచ్ చేయనున్నాయి.ధర కూడా రూ.30 వేలలోపే ఉండే అవకాశం ఉంది.మార్చి నెలలో విడుదల కానున్న కొన్ని ఫోన్ల గురించి తెలుసుకుందాం.
Vivo V27 Pro గురించి చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.36,999.రూ.3500 క్యాష్బ్యాక్ ICICI బ్యాంక్ మరియు ఇతర బ్యాంక్ కార్డ్లపై అందుబాటులో ఉంది.6.78-అంగుళాల సూపర్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంది.ఇది 3D కర్వ్ అంచులతో వస్తుంది.ఆండ్రాయిడ్ 13 ఆధారంగా ఫన్టచ్ ఓఎస్తో ఫోన్ పని చేస్తుంది.4600mAh బ్యాటరీ అమర్చారు.66W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది.వెనుక వైపు 50MP + 8MP + 2MP కెమెరాతో పాటు 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది.
ఇదే కాకుండా OPPO F23 కూడా మార్చిలోనే విడుదల కానుంది.
6 GB RAM + 128 GB ఇంటర్నల్ స్టోరేజ్తో కూడిన దీని ధర రూ.25,456.OPPO F23 Android v11 ఆపరేటింగ్ సిస్టమ్తో నడుస్తుంది.5000 mAh బ్యాటరీ అమర్చారు.ఫోన్ 1080 x 2400 పిక్సెల్ల రిజల్యూషన్తో 6.44 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది.6 GB RAM + 128 GB ఇంటర్నల్ స్టోరేజీతోనే Motorola Moto G73 ఫోన్ రానుంది.దీని ధర 21,990 ఉండొచ్చు.6.4 ఇంచుల అమోల్డ్ డిస్ప్లే కలిగి ఉంది.50 MP + 8 MP + 2 MP కెమెరా సెటప్ వెనుక వైపు ఉంటుంది.16 MP సెల్ఫీ కెమెరా ఉంది.5000 mAh బ్యాటరీ అమర్చారు.