నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ను ఇప్పటికే ప్రారంభించారు.
తొలి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న సమయంలోనే లాక్డౌన్ అమల్లోకి రావడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.ఇక ఈ సినిమాతో మరోసారి బాలయ్య-బోయపాటి కాంబో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యింది.
కాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను గతంలోనే రిలీజ్ చేయగా, దానికి బ్రహ్మాండమైన రెస్పాన్స్ లభించింది.ఇక ఈ సినిమా షూటింగ్ను తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారా అని అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే ఇప్పటికే పలు చిత్రాలు తిరిగి షూటింగ్ను ప్రారంభిస్తుండటంతో, తమ సినిమాను కూడా పట్టాలెక్కించేందుకు బాలయ్య-బోయపాటిలు రెడీ అయ్యారు.ఈ క్రమంలోనే రామోజీ ఫిలిం సిటీలో ఓ భారీ సెట్ను చిత్ర యూనిట్ రెడీ చేస్తోంది.
ఈ సెట్లోనే సినిమాకు సంబంధించి మెజారిటీ షూటింగ్ను పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.కాగా సెప్టెంబర్లో సినిమా షూటింగ్ను తిరిగి ప్రారంభించేందుకు బాలయ్య అండ్ టీమ్ రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.కాగా ఈ సినిమాలో బాలయ్య సరసన ఓ బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
మరి ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.