అమరావతి:
ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఉద్యోగులను అధికార వైసీపీ నేతలు తీవ్రంగా వేధిస్తున్నారని టీడీపీ శాసనమండలి సభ్యులు పర్చూరి అశోక్ బాబు ఆరోపించారు.వీరు చెప్పిన ప్రతీదీ చేయడానికి ప్రభుత్వ ఉద్యోగులేమీ వైసీపీ కార్యకర్తలు కాదని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులంటే ప్రజలకు సేవ చేసేవారని, అంతేగానీ అధికార వైసీపీ నేతల అడుగులకుమడుగులొత్తే తొత్తులు కాదని, ఈ విషయాన్ని వైసీపీ నేతలంతా గుర్తుంచుకోవాలని అశోక్ బాబు హెచ్చరించారు.
వైసీపీ నేతలు, కార్యకర్తలు సాగించే రాజకీయ కార్యకపాలకు, వారి ప్రయోజనాలకు సాయమందించే రాళ్లెత్తే కూలీల మాదిరిగా ప్రభుత్వ ఉద్యోగులు కనిపిస్తున్నారా? అని ప్రశ్నించారు.కదిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కౌన్సిలర్లు పెట్టిన వేధింపులకు తాళలేక పట్టణ ప్రణాళిక అధికారి రహమనే కాస్త విషమిస్తే చచ్చిపోతానని అన్నారని పరిస్థితి ఇంతవరకూ వచ్చిందంటే వారి వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో ఇట్టే అర్థమవుతుందన్నారు.వైసీపీ నేతల, కార్యకర్తల తీవ్రమైన ఒత్తిళ్లు తట్టుకోలేక చాలామంది అధికారులు సామూహిక సెలవులు పెట్టి, ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు స్వేచ్ఛగా విధులు నిర్వహించే పరిస్థితులు రాష్ట్రంలో లేవని ఆరోపించారు.ఉద్యోగులను ఈ విధంగా వేధించినవారిపై క్రిమినల్ కేసులు పెట్టి కాఠినంగా శిక్షించాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు.