ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంటర్ పరీక్షలు ఆవశ్యకతను సుప్రీంకోర్టు వివరించినట్లు తెలిపారు.పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యలను కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు.
ఇంటర్ అదేరీతిలో ఎంసెట్ పరీక్షలను ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటున్నాము అనేది న్యాయస్థానానికి వివరించినట్లు స్పష్టం చేశారు.ఈ క్రమంలో న్యాయస్థానం అఫిడవిట్ దాఖలు చేయాలని రెండు రోజులు టైమ్ ఇవ్వటం జరిగింది.
ఖచ్చితంగా అఫిడవిట్ దాఖలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.దాదాపు పరీక్షల రూముల్లో 15 మంది విద్యార్థులు ఉండే రీతిలో విద్యార్థి విద్యార్థి మధ్య ఐదు అడుగుల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కోర్టు దృష్టికి తెలిపినట్లు స్పష్టం చేశారు.
కరోనా నిబంధనలు అమలు చేస్తూనే పరీక్షలు నిర్వహిస్తామని కోర్టు దృష్టికి తీసుకొచ్చినట్లు అదేరీతిలో పదవ తరగతి మార్కుల విషయంలో గ్రేడ్ విధానం కాకుండా మార్కులు కేటాయించేలా అఫిడవిట్ లో ప్రభుత్వం యొక్క అభిప్రాయాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.