ప్రముఖ వ్యాపార దిగ్గజం, ఎం అండ్ ఎం ఛైర్మన్ అయినటువంటి ఆనంద్ మహీంద్ర.ట్విట్టర్లో ఎల్లపుడూ ఎంతో చురుకుగా ఉంటారు.
తరచూ తన ఫాలోవర్లతో మాటలు కలుపుతారు.ఈ క్రమంలో ఎన్నో విలువైన విషయాలను, వింత అనుభవాలను, ఫన్నీ సంఘటనలను షేర్ చేస్తూ ఉంటారు.
ఫాలోవర్లు అడిగే కొన్ని ప్రశ్నలకు చాలా ఓపికగా జవాబులు చెప్పడం ఆనంద్ మహీంద్రకే చెల్లింది.తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.
కొత్త స్కార్పియో SUV ఎప్పుడు లాంచ్ అవుతుంది? అని ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు ఆనంద్ మహీంద్ర ఇచ్చిన జవాబు.తాజాగా నెట్టింట్లో వైరల్గా మారింది.
సదరు యూజర్ ఇలా అడిగాడు.‘సర్! కొత్త స్కార్పియో కోసం మేము ఎంతగానో ఎదురు చూస్తున్నాం.అది ఎప్పుడు విడుదల అవుతుందో కాస్త చెబుతారా?’ అని ఓ ఫాలోవర్ ట్వీట్ చేయగా దానికి ఆనంద్ మహీంద్రా బదులిస్తూ.‘ష్ష్ష్.ఆ విషయం నీకు చెబితే, నా ఉద్యోగం ఊడిపోతుంది.కానీ కొత్త స్కార్పియో కోసం నీతో పాటు నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను!’ అని ట్వీట్ చేశారు.
అయితే ఆనంద్ మహీంద్ర ఎంతో సమయస్ఫూర్తితో చెప్పిన ఈ జవాబు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.
ఈ క్రమంలో కొంతమంది ‘మిమ్మల్ని ఉద్యోగం నుంచి పీకేది ఎవరు సర్?’ అని అడగగా ఇంకొంతమంది ‘ఈ ఇయర్ బెస్ట్ హ్యూమరస్ ట్వీట్ ఇదే’ అని అంటున్నారు.అలాగే ఇంకొంతమంది స్పందిస్తూ.‘ఏదిఏమైనా.మొత్తానికి కొత్త స్కార్పియో లాంచ్ కోసం మేము ఎదురుచూడక తప్పదు!’ అని ట్వీట్ చేస్తున్నారు.
ఇకపోతే కొత్త స్కార్పియో లాంచ్తో పాటు ఇతర వివరాలను ఎం అండ్ ఎం ఇంకా బయటపెట్టలేదు.కాగా.మార్కెట్లోకి స్కార్పియో అడుగుపెట్టి.ఈ జూన్తో దాదాపు 20ఏళ్లు పూర్తవుతాయి.
ఇక 20 ఏళ్ళు పూర్తైన సందర్భంగా త్వరలోనే కొత్త స్కార్పియోను ఆ సంస్థ తీసుకురావొచ్చని సమాచారం.