మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.ఎన్సీపీ నేత శరద్ పవార్ పై అజిత్ పవార్ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.30 మంది ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ రు కలిశారు.అనంతరం ఆయన మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరారు.
దీంతో అజిత్ పవార్ ను డిప్యూటీ సీఎంగా నియమించిందని సమాచారం.ఈ మేరకు డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేశారని తెలుస్తోంది.
అదేవిధంగా మరో ఎనిమిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.