గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఏదో ఒక వైరస్ ప్రపంచం పై దాడి చేస్తూనే ఉంది.దానితో ప్రపంచంలోనే ప్రజలందరూ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు.
కరోనా వైరస్ కు ఇప్పటివరకు సరైన వ్యాక్సిన్ కనుగొనలేదు శాస్త్రవేత్తలు.కరోనా రెండో సారి వచ్చినప్పుడు కరోనా వైరస్ ద్వారానే కరోనా కు చికిత్స చేశారు కొంతమంది వైద్యులు.
ఈ వైద్యం ద్వారా రోగులకు నయం కావడంవల్ల ప్రతి ఒక్క వైద్యుడు కరోనా రోగులకు ఇలానే చికిత్స చేశారు.తాజాగా చాలామంది శాస్త్రవేత్తలు ఇలాంటి సూత్రాలను తోనే వ్యాక్సిలను తయారు చేస్తున్నారు.
మన శరీరంలోని వైరస్ ను హతమార్చడం కోసం మరో మంచి వైరస్ ను శరీరంలోకి పంపిస్తున్నారు.ప్రస్తుతం మలేరియా వ్యాధి చికిత్సకు కూడా ఇలాంటి ప్రయోగాలనే వైద్య శాస్త్రవేత్తలు చేస్తున్నారు.
అలాంటి టీకా కాకపోయినా అంతకంటే మేలు చేసే కీలక పరిశోధనను చేస్తున్నారు.బిడ్డని కి చెందిన శాస్త్రవేత్తలు కొత్తరకం దోమలను సృష్టిస్తున్నారు.మలేరియా ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వారా సోకుతుందని మనకు తెలిసిందే.ప్లాస్మోడియం పాల్సిఫారం సూక్ష్మజీవులు సోకిన వారిని కుట్టిన దోమలు మనల్ని కుట్టడం వల్ల ఈ వ్యాధి మనకు వస్తుంది.
ఆ సూక్ష్మజీవుల వ్యాప్తిని అరికట్టే పనిలో భాగంగా శాస్త్రవేత్తలు జన్యుమార్పిడి దోమలను సృష్టించారు.
సాధారణ దోమల జన్యువులను మార్చి వాటిలో మలేరియా కారక సూక్ష్మజీవుల వ్యాప్తి ని అరికట్టే ప్రయత్నం చేశారు.దోమల కడుపులో ఆ జీవులు ఎదగడానికి పట్టే కాలాన్ని తగ్గించడం తో అవి దోమ తొండంలో చేరే నాటికి దోమ చనిపోయేలా చేశారు.ఇలాంటి దోమలను ఇతర దోమలతో సంకరం చేస్తే వాటికి పుట్టే దోమల్లోనూ సూక్ష్మజీవులు వ్యాప్తి తగ్గి మలేరియా వ్యాధి తగ్గుతుందని శాస్త్రవేత్తలు అంచనా.