కర్ణాటకలోని పాండవపురానికి ( Pandavapuram in Karnataka )చెందిన ఒక స్కూటర్ మెకానిక్కి జాక్పాట్ తగిలింది. అల్తాఫ్ పాషా( Altaf Pasha ) అనే ఈ వ్యక్తి గత 15 ఏళ్లుగా లాటరీ టికెట్లు కొంటున్నాడు.
ఏదో ఒక రోజు అదృష్టం వరించదా అని ప్రయత్నిస్తూనే ఉన్నాడు.లాటరీ తగిలితే తన కుటుంబానికి మంచి జీవితం ఇస్తాను అని కలలు కనేవాడు.
ఎప్పట్లాగానే ఈసారి కేరళ ఓనం బంపర్ లాటరీ సందర్భంగా తన స్నేహితుడిని రెండు లాటరీ టిక్కెట్లు కొనమని అడిగాడు.ప్రతి టిక్కెట్ ధర 500 రూపాయలు.
అల్తాఫ్ ఒక టిక్కెట్ తన స్నేహితునికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు కానీ, ఆయన భార్య సీమా అడ్డుకుంది.ఆ టిక్కెటే ఇప్పుడు ఆయనకు రూ.25 కోట్ల బంపర్ బహుమతిని గెలిపించింది.
అల్తాఫ్ 18 ఏళ్ల కూతురు తనజ్ ఫాతిమా ( Tanaj Fatima )డాక్టర్ కావాలని కలలు కంటుంది.
తండ్రి లాటరీ గెలిచిన విషయం తెలిసి ఆమె ఎంతో ఆనందించింది.“మా నాన్న ఒక టిక్కెట్ మరొకరికి ఇవ్వాలనుకున్నారు.కానీ, అమ్మ ఆయన్ని అలా చేయనివ్వలేదు.‘ఆ టిక్కెటే మన జీవితాన్ని మార్చే అదృష్ట టిక్కెట్ అయితే?’ అని అమ్మ అన్నారు.అదే జరిగింది” అని తనజ్ చెప్పింది.42 ఏళ్ల అల్తాఫ్ గత 15 ఏళ్లుగా లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నాడు.అక్టోబర్ 9న, ఆయనకు లాటరీ ఏజెంట్ ఫోన్ చేసి, 25 కోట్ల రూపాయల బంపర్ బహుమతి గెలిచావని తెలిపాడు.ఆయన స్నేహితుడు 15 రోజుల క్రితం వయనాడు జిల్లాలోని సుల్తాన్ బథేరిలో ఒక వ్యాపారి వద్ద ఈ గెలిచిన టిక్కెట్ను కొనుగోలు చేశాడు.
అల్తాఫ్ తన బహుమతిని తీసుకోవడానికి కేరళ వెళ్ళిపోయినప్పుడు, అతని తమ్ముడు ముక్తార్కు( Mukhtar ) అభినందనలు వెల్లువలా వస్తున్నాయి.ముక్తార్ మాట్లాడుతూ అల్తాఫ్ ఎప్పుడూ ఇంత పెద్ద అమౌంట్ గెలుస్తానని నమ్మేవాడని చెప్పాడు.అల్తాఫ్ ఈ 25 కోట్ల రూపాయలతో తన 3 లక్షల రూపాయల అప్పు తీర్చివేసి, తన కుటుంబంపై ఉన్న అప్పులన్నీ తీర్చాలని భావిస్తున్నాడు.
తనజ్ ఇంకా ఉత్సాహంగా ఉంది.తన తండ్రి అల్తాఫ్ ఒక ఇల్లు కట్టాలని ప్లాన్ చేస్తున్నాడని చెప్పింది.“మేం ఇప్పుడు ఒక ఇల్లు కొనవచ్చు” అని ఆమె చెప్పింది.ఆమె తమ్ముడు మొహమ్మద్ ఓవైస్ మొదట నమ్మలేదు కానీ, టీవీలో వార్త చూసిన తర్వాత తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు.
కుటుంబం ఇంకా ఈ పెద్ద విజయాన్ని జీర్ణించుకోవడానికి ప్రయత్నిస్తోంది.
ఈ ఏడాది ఓనం బంపర్ లాటరీకి కేరళ లాటరీ శాఖ 71 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి.అల్తాఫ్ మాత్రమే కాదు, ఇంకా చాలామంది ఈ లాటరీ గెలుపు వల్ల లాభపడ్డారు.ఆ టిక్కెట్ సబ్ ఏజెంట్ నాగరాజు, లాటరీ కేంద్ర యజమాని ఏ ఎం జినీష్ కూడా కమిషన్లు పొందుతారు.ఎస్ జె లక్కీ సెంటర్ యజమాని అయిన జినీష్కు 25 లక్షల రూపాయలు లభిస్తాయి.కొన్ని నెలల క్రితం తన తమ్ముడితో కలిసి ‘ఎన్ జి ఆర్ లక్కీ సెంటర్’ను ఏర్పాటు చేసిన మాజీ కూలీ నాగరాజుకు 2.5 కోట్ల రూపాయలు లభిస్తాయి.నాగరాజు తన విజయానికి తన తల్లిదండ్రులను, వారి ప్రార్థనలను కారణం అంటున్నాడు.