సినిమా ఇండస్ట్రీలోని నటీనటుల ప్రతిభకు అవార్డులు కొలమానం అనే సంగతి తెలిసిందే.అయితే కొన్ని సందర్భాల్లో అవార్డులు ప్రతిభ ఉన్న నటులకు కాకుండా ఏ మాత్రం ప్రతిభ లేని నటులకు వస్తుంటాయి.
కొన్ని సందర్భాల్లో డబ్బులు ఇచ్చి అవార్డులను కొనుగోలు చేస్తుంటారనే ప్రచారం కూడా జరుగుతుంది.అయితే ఈ ప్రచారంలో నిజానిజాలేంటో సామాన్య ప్రజలలో చాలామందికి తెలియదు.
అయితే బాలీవుడు నటుడు రిషి కపూర్ తాను 30,000 రూపాయలు ఇచ్చి ఫిల్మ్ ఫేర్ అవార్డును కొనుగోలు చేశానంటూ ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.రిషి కపూర్ తండ్రి రాజ్ కపూర్ కాగా రాజ్ కపూర్ రిషి కపూర్ ను బాబీ అనే సినిమాతో హీరోగా పరిచయం చేశారు.
ఈ సినిమాలో రిషి కపూర్ కు జోడీగా డింపుల్ కపాడియా నటించారు.ఈ సినిమాలోని హమ్ తుమ్ ఏక్ పాట ఏ స్థాయిలో హిట్టైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
బాబీ సినిమా సక్సెస్ సాధించడంతో డింపుల్ కపాడియా యూత్ లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు.
వాస్తవానికి బాబీ సినిమాను తీసే సమయానికి రాజ్ కపూర్ ఆర్థికపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు.బాబీ సినిమాకు ముందు రాజ్ కపూర్ తీసిన మేరా నామ్ జోకర్ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.రాజ్ కపూర్ స్టూడియోను కూడా తాకట్టు పెట్టి బాబీ సినిమాను తీశారు.
ఈ సినిమా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కొరకు అమితాబ్, రిషి కపూర్ మధ్య పోటీ జరిగింది.అందరూ అమితాబ్ కు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వస్తుందని భావిస్తే రిషి కపూర్ అవార్డ్ వస్తే కెరీర్ కు ప్లస్ అవుతుందని భావించారు.అందువల్ల అవార్డ్ కోసం 30,000 రూపాయలు ఖర్చు చేసి రిషి కపూర్ అవార్డును కొనుగోలు చేశారు.