రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ): ప్రజల సమస్యల పై అధికారులు సత్వరమే స్పందించి పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ( Collector Sandeep Kumar Jha )ఆదేశించారు.జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఖీమ్యా నాయక్ తో కలిసి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను ఆయా శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, సత్వరమే పరిష్కరించాలని సూచించారు.
రెవెన్యూ శాఖకు 95, హాండ్లూమ్స్ & టెక్టైల్స్ 1, ఎడి సర్వే 1, ఎడ్యుకేషన్ 7, ఉపాధి కల్పన శాఖకు 8, ఫారెస్ట్ 1, సివిల్ సప్లై 1, డి.
ఎం.హెచ్.ఓ., 6, డి.పి.ఓ.7, డి.అర్ డి.ఓ.7, డి.డబ్ల్యూ.ఓ.1, అర్.టీ.సి.1, ఎస్సీ కార్పొరేషన్ 2, మిషన్ భగీరథ 1, పంచాయితి రాజ్ 3, 2బి.హెచ్.కే.1, ఎల్.డి.ఎం.1, ఎం.డి.సెస్ 12, ఎం.పి.డి.ఓ.లు చందుర్తి 1,గంబిరావుపేట్2, కొనరావుపేట 1,తంగళ్ళ పల్లి 1,వేములవాడ2, సిరిసిల్ల మున్సిపల్ 19, వేములవాడ మున్సిపల్ 1, ఎస్.డి.సి.7,పోలీస్ 6, ఆయా శాఖలకు అన్ని కలిపి మొత్తం 196 వచ్చాయన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.