తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ప్రధాని మోదీ అన్నారు.ఈక్రమంలో కేసీఆర్ ను ఇంటికి పంపే సమయం వచ్చిందని పేర్కొన్నారు.
కేసీఆర్ కేవలం తన కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తారని మోదీ విమర్శించారు.హామీలను నెరవేర్చకుండా కేసీఆర్ ప్రజలను మోసం చేశారన్న ఆరోపించిన మోదీ ఇచ్చిన హామీలను పూర్తి చేయడమే మోదీ గ్యారెంటీ అని స్పష్టం చేశారు.
తన ఇల్లు కట్టుకోవడానికి తాను ప్రధాని కాలేదని చెప్పారు.పేద ప్రజల ఇళ్లు కట్టడం కోసమే ప్రధాని అయ్యానన్నారు.
కేంద్ర పథకాలు అమలు కాకుండా కేసీఆర్ అడ్డుకున్నారని ఆరోపణలు చేశారు.నిజామాబాద్ పసుపు బోర్డు హామీని నిలబెట్టుకున్నామని తెలిపారు.
బీజేపీ అధికారంలోకి రాగానే తెలంగాణలో పెట్రోల్ రేట్లు తగ్గిస్తామని చెప్పారు.బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనన్న మోదీ కేసీఆర్ ఎప్పుడూ కాంగ్రెస్ గురించే ఆలోచిస్తారని తెలిపారు.
బీజేపీతోనే సామాజిక న్యాయం సాధ్యమని స్పష్టం చేశారు.డబుల్ ఇంజన్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యమన్న మోదీ కేంద్రంతో పాటు తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.