తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఇప్పటివరకు మూడు విడతల్లో అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.అయితే ఈ మూడో లిస్ట్ తరువాత అసంతృప్తుల ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి.
ఇందులో భాగంగానే పటాన్ చెరు కాంగ్రెస్ నేతలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నివాసం ముట్టడికి ప్రయత్నించారు.పటాన్ చెరు టికెట్ ను నీలం మధుకు ఇవ్వడంపై మరో నేత కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ మేరకు రేవంత్ రెడ్డి నివాసం వద్ద కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గీయుల ఆందోళనకు దిగారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసన చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకుని అరెస్ట్ చేశారు.
ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.