విజయవాడకు చేరుకున్న చంద్రబాబు.. కాసేపట్లో వైద్యపరీక్షల కోసం తరలింపు

టీడీపీ అధినేత చంద్రబాబు వస్తున్న కాన్వాయ్ కుంచనపల్లిలోని సిట్ కార్యాలయానికి చేరుకుంది.దాదాపు తొమ్మిది గంటల పాటు చంద్రబాబు కాన్వాయ్ లోనే ప్రయాణం చేశారు.

 Chandrababu Reached Vijayawada.. Soon He Will Be Shifted For Medical Examination-TeluguStop.com

ఈ క్రమంలో చంద్రబాబును కాసేపటిలో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించనున్నారు.వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కోర్టుకు తీసుకెళ్లనున్నారు.

అయితే చంద్రబాబును తరలిస్తున్న నేపథ్యంలో హైవేపై చంద్రబాబు వెంట టీడీపీ కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు.

టీడీపీ శ్రేణుల ర్యాలీతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారీగా స్తంభించి పోయింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి కార్యకర్తలను చెదరగొట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.మరోవైపు గన్నవరంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.

శాంతి భద్రతల సమస్యలు రాకూడదనే ఉద్దేశంతో పోలీసులు జనసేనాని పవన్ కల్యాణ్ ప్రత్యేక విమానానికి అనుమతి నిరాకరించారు.ఈ క్రమంలో చంద్రబాబును కలిసేందుకు కుటుంబ సభ్యులకు మాత్రమే అనుమతిని ఇస్తామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube